కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

ABN , First Publish Date - 2022-03-01T14:24:24+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం నుంచి పెరిగింది....

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

రూ.2,012కు పెరిగిన 19 కిలోల గ్యాస్ ధర

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం నుంచి పెరిగింది. మార్చి 1 నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.105 పెంచారు.ఈ పెంపుతో మంగళవారం నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012 కానుంది. 5 కిలోల సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 5 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో 569 రూపాయలు. దేశీయ ఎల్పీజీ సిలిండర్‌ ధర పెరగ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య సిలిండర్ రేటు పెరగనుంది.



నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.91.50 తగ్గించాయి.గత నెల1వతేదీన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గించగా, సరిగ్గా నెలరోజుల తర్వాత మళ్లీ 105రూపాయలు పెంచింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

Updated Date - 2022-03-01T14:24:24+05:30 IST