ప్రధానిపై అసభ్య పోస్టింగ్.. నార్సింగ్ పీఎస్లో ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-08-11T14:45:15+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాన్ని ఫేస్బుక్లో పెట్టి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై నార్సింగ్ పోలీస్స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు
నార్సింగ్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాన్ని ఫేస్బుక్లో పెట్టి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై నార్సింగ్ పోలీస్స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రధాని పేడ తింటున్నట్లు, ఓ మహిళ కాళ్లు మొక్కుతున్నట్లు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేసిన వాటిని నార్సింగ్కు చెందిన ఓ వ్యక్తి షేర్ చేయడంతోపాటు లైక్, కామెంట్ కూడా చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేీపీ దళితమోర్చా నార్సింగ్ మునిసిపాలిటీ అధ్యక్షుడు అనిల్కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.