పంత్, సంజులకు ఇదే ఛాన్స్: మంజ్రేకర్
ABN , First Publish Date - 2020-08-12T00:10:25+05:30 IST
సంజుశాంసన్, రిషభ్ పంత్లకు ఈ ఏడాది ఐపీఎల్ మంచి అవకాశమని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. యువ కీపర్లు...
న్యూఢిల్లీ: సంజుశాంసన్, రిషభ్ పంత్లకు ఈ ఏడాది ఐపీఎల్ మంచి అవకాశమని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. యువ కీపర్లు ఇద్దరిలోనూ జాతీయ జట్టుకు ఆడగల ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయని, అయితే వాటిని సరైన సమయంలో నిరూపించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఏదో ఒక ఇన్నింగ్స్లో రాణిస్తే సరిపోదని, టోర్నీ ఆసాంతం నిలకడైన ప్రదర్శన చేస్తే జాతీయ జట్టులోని వచ్చేందుకు మార్గం సుగమం అయినట్లేనని అన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్కు ఆడనున్నారు.