పాలిసెట్‌ ద్రువపత్రాల పరిశీలన ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-16T06:47:53+05:30 IST

ఇటీవల జరిగిన పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని

పాలిసెట్‌ ద్రువపత్రాల పరిశీలన ప్రారంభం

కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 15: ఇటీవల జరిగిన పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌ తెలిపారు. ఈ నెల 18 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మొదటి రోజు 130 మంది విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన చేయడం జరిగిందని బుధ వారం నుంచి పాలిటెక్నిక్‌ కళాశాలల ఎంపిక ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవచ్చని సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవాలని అనంతరం ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు.

Updated Date - 2020-09-16T06:47:53+05:30 IST