ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మద్దూరులోని ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులను సర్పంచ్‌ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రారంభం
మద్దూరు ప్రాథమిక పాఠశాలలో పనులను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు

మద్దూరు/కొండపాక, మే 27: మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మద్దూరులోని ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులను సర్పంచ్‌ కంఠారెడ్డి జనార్ధన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీశైలం, ఎంపీటీసీ బొప్పె కనకమ్మ, ఉప సర్పంచ్‌ ఆరీఫ్‌, పీఆర్‌ ఏఈ వినయ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఆహ్మద్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవీందర్‌, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నర్సింహులు రాజు, రాజయ్య, బ్రహ్మం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST