‘కమాండ్ కంట్రోల్’ పనుల్లో వేగం పెంచాలి: సీఎస్
ABN , First Publish Date - 2020-09-25T09:38:17+05:30 IST
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. కమాండ్ కంట్రోల్ నిర్మాణ పనులపై సీఎస్ చైర్మన్గా ఉన్న హైపర్ కమిటీ...
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. కమాండ్ కంట్రోల్ నిర్మాణ పనులపై సీఎస్ చైర్మన్గా ఉన్న హైపర్ కమిటీ గురువారం బీఆర్కే భవన్లో సమావేశమైంది. డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్నట్లు సీఎస్ చెప్పారు.