ప్రణాళికాబద్ధంగా మలేరియా, డెంగ్యూను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-06-30T06:00:32+05:30 IST

డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రణాళికాబద్ధంగా మలేరియా, డెంగ్యూను అరికట్టాలి
మాట్లాడుతున్న కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

 ప్రణాళికాబద్ధంగా మలేరియా, డెంగ్యూను అరికట్టాలి

కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

చిట్టినగర్‌, జూన్‌ 29: డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళికతో డెంగ్యూ, మలేరియాను అరికట్టాలన్నారు. బుధవారం కమిషనర్‌ తన చాంబర్‌లో ఏన్టీఆర్‌ జిల్లా మలేరియా అధికారులు. నగరపాలక సంస్థ పరిధిలోని మలేరియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది నిబద్ధతతో ప్రణాళిక బద్ధంగా మలేరియా,డెంగ్యూ కేసులు అరికట్టాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి బి.రామారావు, నగర  అసిస్టెంట్‌ మలేరియా అధికారి సూర్య నాయక్‌, బయాలజిస్ట్‌, సీఎంవోహెచ్‌ ఇన్‌చార్జి బాబు శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

ఆధునికీకరణ పనులను వేగవంతం చేయండి

పూర్ణాంనందంపేట: వెహికల్‌ డిపోలో చేపట్టిన ఆధునికీకరణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. పూర్ణానందంపేటలోని వెహికల్‌ డిపోను బుధవారం ఆయన సందర్శించి డిపోలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. డిపో ఆవరణలోని రైల్వే కాంపౌండ్‌ వద్ద ఉన్న టాయిలెట్స్‌ తొలగించి డిపో వెనుక భాగంలో నిర్మించాలని, మెకానికల్‌ షెడ్‌ ముందు రోడ్డు ప్యాచ్‌ వర్క్స్‌ పనులు పూర్తి చేయాలని, డిపోలో డ్రెయున్‌ పాడైన చోట్ల తగిన మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు.  ఈఈ కె. కోటేశ్వరరావు, స్టోర్స్‌ ఇన్‌చార్జ్‌ యోగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:00:32+05:30 IST