నీ ఇంటికి వస్తా..!
ABN , First Publish Date - 2022-06-29T06:41:26+05:30 IST
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కణేకల్లు పంచాయతీ ఇనచార్జి పోతన్నకు ఓ వ్యక్తి ఫోన చేసి బెదిరించాడు.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కణేకల్లు పంచాయతీ ఇనచార్జి పోతన్నకు ఓ వ్యక్తి ఫోన చేసి బెదిరించాడు. జక్కలవడికి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎర్రిస్వామి రెడ్డిని హెడ్ కానిస్టేబుల్ రఘునాథ రెడ్డి రెండు రోజుల క్రితం చితకబాదాడు. దీంతో రఘునాథరెడ్డిని పొగుడుతూ వైసీపీ వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి కౌంటర్గా గుమ్మఘట్ట మండలంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నప్పుడు రఘునాథరెడ్డి దళితులపై చిందులు వేసిన వీడియోను ట్యాగ్ చేశారు. దీంతో ఆ వ్యక్తం టీడీపీ సోషల్ మీడియాలో సేవలందిస్తున్న పోతన్నకు ఫోన చేశాడు. ‘రఘునాథరెడ్డి గురించి నీకు ఏం తెలుసు..? ముందు ఆ వీడియోను గ్రూపు నుంచి డిలీట్ చెయ్. లేదంటే 30 మందితో నీ ఇంటి వద్దకు వస్తా. నీకథ తేలుస్తా..’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్లో బెదిరించిన వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డికి సమీప బంధువని భావిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
- రాయదుర్గం