తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-03T18:51:27+05:30 IST

Hyderabad: ప్రధాని మోదీపై పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కారును కూల్చే సత్తా మోదీకి లేదని పేర్కొన్నరారు.

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

Hyderabad: ప్రధాని మోదీపై  పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కారును కూల్చే సత్తా మోదీకి లేదని పేర్కొన్నరారు. 

బీజేపీది దుష్టబుద్ధి 

‘‘తెలంగాణ వనరులను దోచుకోడానికి నార్త్ ఇండియా కంపెనీ మోడీ అండ్ టీం వచ్చింది. కేసీఆర్ ముందు మోడీయిజం, ఈడీయిజం పనిచేయవు.  బండి సంజయ్ ఒక బచ్చా. మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తే మేమెందుకు ప్రధానిని స్వాగతం పలుకుతాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ప్రజలకు తప్ప మోడీకి లేదు.  టీఆర్ఎస్‌ది అభివృద్ధి ఆలోచన.. బీజేపీది దుష్టబుద్ధి ఆలోచన. మోడీ భద్రత మాకు చాలా ముఖ్యం. భద్రత పరంగా స్టేట్ ఇంటలిజెన్స్ పోలీసులు కచ్చితంగా ఉంటారు. కేంద్రమంత్రులందరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం పోలీసులపై ఉంటుంది. బీజేపీ నాయకులు పాకిస్తాన్, మతాలు అని అనేక మాటలు మాట్లాడుతారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళను ఎప్పటికప్పుడు కనిపెట్టే భాద్యత ఇంటిలిజెన్స్ కు ఉంటుంది. కేంద్ర బీజేపీ నేతలు మా ఒడ్లు కొనరు కాని.. మా తెలంగాణ మహిళ యాదమ్మ వండిన వంటలను ఎలా తింటారు.’’ అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.  

Updated Date - 2022-07-03T18:51:27+05:30 IST