అల్లూరి పోరాట శతాబ్ది ఉత్సవానికి తరలిరండి
ABN , First Publish Date - 2022-08-20T06:13:06+05:30 IST
డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న నిర్వహించే అల్లూరి పోరాట శతాబ్ది ఉత్సవానికి ఆదివాసీలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు
చింతపల్లి, ఆగస్టు 19: డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న నిర్వహించే అల్లూరి పోరాట శతాబ్ది ఉత్సవానికి ఆదివాసీలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చింతపల్లి బ్రిటీష్ పోలీసు స్టేషన్పై దాడిచేసి వంద ఏళ్లు పూర్తికావడంతో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు రాజన్నదొర, అమర్నాథ్, రోజా ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివప్రసాద్, జీసీసీ ఉద్యోగుల సంఘం నేత దురియా హేమంత్ పాల్గొన్నారు.