కరోనా అంటిందంటూ.. భారత్ నుంచి వచ్చే బర్రె మాంసంపై నిషేధం..

ABN , First Publish Date - 2021-07-28T06:13:30+05:30 IST

భారత్‌లో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ విలయతాండవం చేస్తోంది.

కరోనా అంటిందంటూ.. భారత్ నుంచి వచ్చే బర్రె మాంసంపై నిషేధం..

కంబోడియా: భారత్‌లో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే బర్రె మాంసంపై నిషేధం విధిస్తున్నామంటూ కంబోడియా ప్రకటించింది. ఈ క్రమంలో భారత్ నుంచి వాటర్ బఫెలో మాంసంతో తమ దేశానికి వచ్చిన ఐదు కంటైనర్లను కంబోడియాలోకి రానివ్వలేదు. ఆ మాంసానికి కరోనా అంటిందని కంబోడియా ఆరోపించింది. ఈ షిప్పింగ్ తీసుకొచ్చిన ఐదు కంటైనర్లలో మూడింటిపై కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మరికొన్ని రోజుల్లో వైరస్ సోకిన కంటైనర్లను నాశనం చేసేస్తామని పేర్కొంది.

Updated Date - 2021-07-28T06:13:30+05:30 IST