మహాత్మాగాంధీ విగ్రహానికి రంగులు
ABN , First Publish Date - 2022-08-15T05:59:45+05:30 IST
మహాత్మాగాంధీ విగ్రహానికి రంగులు
- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
షాద్నగర్, ఆగస్టు 14: ‘మహాత్మా మన్నించు’ శీర్షికతో ఈ నెల 13న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించారు. ఫరూఖ్నగర్లో రంగు వెలిసిన గాంధీ విగ్రహానికి ఆదివారం తెల్ల రంగు వేశారు. సోమవారం జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు విగ్రహాన్ని సిద్ధం చేశారు.