పునరావాస కాలనీలు పూర్తిచేయాలి : ఆర్డీవో
ABN , First Publish Date - 2020-11-30T07:09:37+05:30 IST
పోలవరం నిర్వాసితులకోసం నిర్మిస్తున్న పునరావాసకాలనీ గృహనిర్మాణాలు డిసెంబరు నెలాఖరుకి పూర్తిచేయాలని రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్ ఆదేశించారు.
గంగవరం, నవంబరు 29: పోలవరం నిర్వాసితులకోసం నిర్మిస్తున్న పునరావాసకాలనీ గృహనిర్మాణాలు డిసెంబరు నెలాఖరుకి పూర్తిచేయాలని రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్ ఆదేశించారు. ఆదివారం మండలంలోని నేలదోనెలపాడులో పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న దేవీ పట్నం మండలం కొండమొదలు తదితర గ్రామాలకు చెందిన గిరిజనులకు నిర్మిస్తున్న పునరావాసకాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సుమారు 390 నిర్వాసిత కుటుంబాలకు గృహాలు నిర్మిస్తామని, ఇప్పటివరకూ సుమారు 200 గృహాలు పూర్తిచేశామని ఇంజనీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు. నిర్వాసితులకు మెరుగైన నాణ్యమైన గృహాలను నిర్మించి అందించాలని ఆయన ఆదేశించారు. నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన వెంట తహశీల్దార్ రామకృష్ణ, డిఫ్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ దేవేంద్ర, తదితరులున్నారు.ఙఙస్థానిక, జమిలి ఎన్నికలకు సిద్ధంకండి