యోగా చేస్తూ ఆశ్రమం పైనుంచి పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-18T21:59:56+05:30 IST

యోగా చేస్తూ ఆశ్రమం పైనుంచి పడి వ్యక్తి మృతి

యోగా చేస్తూ ఆశ్రమం పైనుంచి పడి వ్యక్తి మృతి

లఖ్‌నవూ: కొలంబియా దేశానికి చెందిన ఓ వ్యక్తి యోగా చేస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని చికిత్స తీసుకుంటున్న క్రమంలో మరణించాడు. ఒమర్ అర్లనోకాతిలోక్స్‌ అనే ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఉన్న యుగల్ భజన్ కుటి అనే ఆశ్రమంలో కొద్ది సంవత్సరాలుగా ఉంటున్నాడు. అయితే ఆదివారం ఆశ్రమం పైన యోగా చేస్తున్న క్రమంలో కాలు జారి కిందపడ్డాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ సరైన వైద్యం లేకపోవడంతో ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సదరు ఆసుపత్రి వైద్యులు సూచించారు. అక్కడి నుంచి వేరే ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఒమర్ మరణించాడు.


కాగా, అతడి దహన సంస్కారాలను హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నట్లు అతడితో పాటు ఆశ్రమంలో ఉంటున్న మరియా క్రిష్ణ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఇక ఒమర్ మరణ వార్త విషయాన్ని కొలంబియా ఎంబసీతో పాటు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు క్రిష్ణ తెలిపాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు.

Updated Date - 2021-05-18T21:59:56+05:30 IST