గుర్తుతెలియని వాహనం ఢీ - ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-07-03T05:20:13+05:30 IST

మండలంలోని తిమ్మాపురం సమీపంలో శుక్రవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరెడ్డిపల్లికి చెందిన ఎంఆర్‌ శివశంకర్‌(49) మృతిచెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీ - ఒకరి మృతి
మృతుడు శివశంకర్‌

పెనుకొండ రూరల్‌, జూలై 2: మండలంలోని తిమ్మాపురం సమీపంలో శుక్రవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరెడ్డిపల్లికి చెందిన ఎంఆర్‌ శివశంకర్‌(49) మృతిచెందాడు. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపి న వివరాలివి. శివశంకర్‌ కియ సమీపంలో ని ఎనఎఫ్‌సీ హోటల్‌లో పని చేస్తుండేవా డు. రాత్రి పనులు ముగించుకుని స్వగ్రామానికి నడుచుకుని వస్తుండగా, సోలార్‌ ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడ్డారు.   గుర్తుతెలియని వ్యక్తులు బాధితున్ని పెనుకొండ ఆసుపత్రిలో చేర్పించి వె ళ్లిపోయారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఆసుపత్రిలో చేర్పించిన వారి వివరాలు నమోదు చేయలేదు. హోటల్‌ ని ర్వాహకులు, ఆసుపత్రి సిబ్బందిపై అనుమానం ఉందని మృతుని భార్య గౌరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నారాయణ ఆసుపత్రితో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. 


Updated Date - 2022-07-03T05:20:13+05:30 IST