కళాశాల విద్యార్థులు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి
ABN , First Publish Date - 2022-01-18T04:26:28+05:30 IST
కళాశాల విద్యార్థులందరూ శతశాతం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని స్థానిక ఎంపీడీవో లాలం సీతయ్య అన్నారు.
ఎంపీడీవో సీతయ్య
చింతపల్లి, జనవరి 17: కళాశాల విద్యార్థులందరూ శతశాతం కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని స్థానిక ఎంపీడీవో లాలం సీతయ్య అన్నారు. సోమవారం స్థానిక డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఎంపీడీవో సందర్శించారు. ప్రభుత్వం 15 నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన యువతకు కొవిడ్ టీకాలు వేయడం జరుగుతుందన్నారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు విధిగా కొవిడ్ టీకా వేసుకునేలా ప్రిన్సిపాల్, అధ్యాపకులు చొరవ తీసుకోవాలన్నారు. అలాగే పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో నివాసముంటున్న విద్యార్థులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు హెచ్డబ్ల్యూవోలు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.