కళాశాల విద్యార్థినుల బాహాబాహీ

ABN , First Publish Date - 2022-04-28T14:13:13+05:30 IST

స్థానిక న్యూ వాషర్‌మెన్‌పేటలో ప్రభుత్వ ఆర్ట్స్‌ సైన్స్‌, వృత్తి విద్య కళాశాల విద్యార్థినులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌

కళాశాల విద్యార్థినుల బాహాబాహీ

పెరంబూర్‌(చెన్నై): స్థానిక న్యూ వాషర్‌మెన్‌పేటలో ప్రభుత్వ ఆర్ట్స్‌ సైన్స్‌, వృత్తి విద్య కళాశాల విద్యార్థినులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కళాశాల ముగిసిన తరువాత పలువురు విద్యార్థినులు బస్సుల కోసం లక్ష్మి ఆలయ సమీపంలోని బస్టా్‌పకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థినుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఇది తీవ్రమై విద్యార్థినులు రెండు గ్రూపులుగా మారి పరస్పర దాడులకు పాల్పడంతో ఆ ప్రాంత ప్రజలు విస్తుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విద్యార్థినులను మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. విద్యార్థినులు పరస్పర దాడులకు పాల్పడే సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వెలువడి వైరల్‌గా మారాయి.

Updated Date - 2022-04-28T14:13:13+05:30 IST