విద్యార్థినిపై లైంగిక వేధింపులు..కాలేజీ ప్రొఫెసర్ Suspension
ABN , First Publish Date - 2021-11-22T17:20:01+05:30 IST
ఒక విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో కోయంబత్తూరు ప్రభుత్వ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ సస్పెన్షన్కు గురయ్యారు. కోవైలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీబీఏ డిపార్ట్మెంట్ అధిపతిగా ప్రొఫెసర్ రఘునందన్ (42) ఉన్నారు...
చెన్నై/అడయార్: ఒక విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో కోయంబత్తూరు ప్రభుత్వ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ సస్పెన్షన్కు గురయ్యారు. కోవైలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీబీఏ డిపార్ట్మెంట్ అధిపతిగా ప్రొఫెసర్ రఘునందన్ (42) ఉన్నారు. ఈయన తమ కాలేజీలో చదువుకునే ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై పల్లడం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో శనివారం కాలేజీ ప్రిన్సిపాల్ సారథ్యంలోని కాలేజీ ఇంటర్నల్ కమిటీ సమావేశమై రఘునందన్ వ్యవహారంపై చర్చించారు. ఆ తర్వాత రఘునందన్ను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. అలాగే, విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళారు.