కామాక్షితాయి సన్నిధిలో కలెక్టర్ దంపతులు
ABN , First Publish Date - 2022-06-25T04:45:49+05:30 IST
కలెక్టర్ చక్రధర్బాబు దంపతులు శుక్రవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు.
బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 24: కలెక్టర్ చక్రధర్బాబు దంపతులు శుక్రవారం మండలంలోని జొన్నవాడ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు అర్చకులు ఆలయ మర్యాదలతో కలెక్టర్ దంపతులను స్వాగతించారు. అనంతరం స్వామి, అమ్మవారి వద్ద వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వారి వెంట బుచ్చి తహసీల్దారు శ్రీనివాసులు ఉన్నారు. కాగా ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి నిత్యకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.సాయంత్రం సామూహిక కుంకుమార్చన జరిగింది. అనంతరం కామాక్షితాయిని పల్లకిలో కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు.