గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి సరెండర్ చేసిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-01-27T02:48:44+05:30 IST
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి ప్రభుత్వం సరెండర్ చేసింది. కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలు జీఏడీకి సరెండ్
అమరావతి: గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి ప్రభుత్వం సరెండర్ చేసింది. కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలు జీఏడీకి సరెండ్ చేసింది. జేసీలు దినేష్ కుమార్, మార్కండేయులకు కలెక్టర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి పరిపాలన శాఖకు అటాచ్ చేసింది. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్కు తిరుపతి అర్బన్ ఎస్పీ బాధ్యతలు అప్పగించింది. ఎస్ఈసీ సూచనలతో ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది.