అల్లూరి జయంతి ఉత్సవాలకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-05-24T06:25:46+05:30 IST

అల్లూరి జయంతి ఉత్సవాలకు సన్నాహాలు

అల్లూరి జయంతి ఉత్సవాలకు సన్నాహాలు
అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

 స్వస్థలం మోగల్లులో కలెక్టర్‌ పర్యటన
పాలకోడేరు, మే 23: అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను జూలై 4 నుంచి ఏడాది పాటు నిర్వహించనున్నారు. సన్నాహాల్లో భాగంగా అల్లూరి స్వస్థలం మోగల్లులోని ఆయన జన్మించిన ప్రదేశాన్ని కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం సందర్శించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి స్మారక కట్టడాన్ని నిర్మించేందుకు గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లూరి వారసులు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. అల్లూరి పేరున మ్యూజియం, గ్రంథాలయం నిర్మాణాలకు గతంలో కొంత స్థలాన్ని సమీకరించారని, ఇప్పుడు అది ఆక్రమణలకు గురైందని, తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవించారు. స్థల సంరక్షకుడు సీతారామచంద్రరాజు అల్లూరి జీవిత విశేషాలు తెలిపే పుస్తకాన్ని కలెక్టర్‌కు అందజేశారు. తహసీల్దార్‌ ఎ.మధుసూదనరావు, ఎంపీడీవో ఏవీ అప్పారావు, ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంతెన యోగేంద్రకుమార్‌, సర్పంచ్‌ మల్లిపూడి కృష్ణకుమారి, గ్రామ పెద్దలు, అల్లూరి యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:25:46+05:30 IST