ఎమ్మెల్సీ ఓటు హక్కు గుర్తింపు పత్రాలు
ABN , First Publish Date - 2021-03-07T05:18:14+05:30 IST
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జిల్లాలోని 49 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు.
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 6 : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న జిల్లాలోని 49 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఓటరుగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయులు ఓటు వేసేం దుకు వెళ్లేటప్పుడు ఓటరు ఫొటో గుర్తింపుకార్డు తీసుకు వెళ్లాలి. ఈ కార్డు లేదంటే ఓటరుగా గుర్తింపు పొందిన టీచర్లు ఫొటో కలిగిన ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డు/ఇండియన్ పాస్పోర్ట్ /ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు జారీచేసిన సర్వీసు గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిగా జారీచేసిన గుర్తింపు కార్డు / విద్యా శాఖ జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డు, గుర్తింపు పొందిన యూనివర్శిటీ మంజూరు చేసిన డిగ్రీ, డిప్లమో ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారికి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు.