లోలం, మల్లాపూర్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ABN , First Publish Date - 2020-07-01T11:32:57+05:30 IST
ఇందల్వాయి మండలంలోని లోలం, మల్లాపూర్ గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ నా రాయణరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇందల్వాయి, జూన్ 30: ఇందల్వాయి మండలంలోని లోలం, మల్లాపూర్ గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ నా రాయణరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన గ్రామంలోని పారిశుద్ధ్యం, రెవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ పనులను పరిశీలించారు. మల్లాపూర్ గ్రామంలో కంపోస్ట్ షెడ్డును ప్రారంభించారు. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్ల వెంట మొక్కలు నాటలేదని సర్పంచ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మురుగు కాల్వ లు, రోడ్ల వెంట చెత్తలేకుండా చూడాలని తెలిపారు. హ రితహారంలో మొక్కలు నాటి 85 శాతం బతికేలా చూ సుకోవాలన్నారు. 400 మొక్కలకు ఒక వన సంరక్షకుడి ని ప్రభుత్వం ఇస్తుందని, మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వ హించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్, తహసీల్దార్ రమేష్, ఏపీవో మం జుల, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ సరిత తదితరులు పాల్గొన్నారు.