సచివాలయాల ద్వారా సత్వర సేవలు

ABN , First Publish Date - 2020-09-27T10:19:39+05:30 IST

సచివాలయాల ద్వారా సత్వర సేవలను ప్రజలకు అందించాలని సిబ్బందికి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు.

సచివాలయాల ద్వారా సత్వర సేవలు

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ 



ఫిరంగిపురం, సెప్టెంబరు 26: సచివాలయాల ద్వారా సత్వర సేవలను ప్రజలకు అందించాలని సిబ్బందికి కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. శనివారం మండలంలోని వేములూరిపాడు సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. గ్రామంలో ఎంపీయూపీ స్కూల్‌ నాడు - నేడు పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. రేపూడి గ్రామంలో గల వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఈవీఎంల గోడౌన్‌ను పరిశీలించారు. ఈవీఎంల భద్రత, లైటింగ్‌ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ కె.సాంబశివరావు,  తదితర అధికారులు పాల్గొన్నారు. మండలంలోని 113 తాళ్ళూరు గ్రామ సచివాలయాన్ని జేసీ(సచివాలయాలో) సందర్శించారు. ప్రజల అర్జీలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.శివప్రసాదు, ఈవోపీఆర్‌డీ పూర్ణచంద్రరరావు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T10:19:39+05:30 IST