‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-11T05:17:17+05:30 IST

‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించిన కలెక్టర్‌

‘గాంధీ’ చిత్రాన్ని వీక్షించిన కలెక్టర్‌
శ్రీదేవిమాల్‌లో గాంధీ చలనచిత్రాన్ని వీక్షిస్తున్న కలెక్టర్‌, డీఆర్‌వో తదితరులు

హనుమకొండ రూరల్‌, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న  స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు గాంధీ చలనచిత్రాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు విద్యార్థులతో కలిసి హనుమకొండలోని ఏషియన్‌ శ్రీదేవిమాల్‌లో గాంధీ చలనచిత్రాన్ని వీక్షించారు. ఈ నెల 11వ తేదీతోపాటు 16 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని సుమారు 12 సినిమాహాళ్లలో గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు చూపించనున్నారు. కలెక్టర్‌తోపాటు రెవెన్యూ డివిజనల్‌ అధికారి వాసుచంద్ర, డీఆర్‌డీవో ఏ.శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు గాంధీ చిత్రాన్ని వీక్షించారు.


Updated Date - 2022-08-11T05:17:17+05:30 IST