కొవిడ్ ప్రత్యేక అధికారిని కలిసిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-19T05:23:41+05:30 IST
కర్నూలు జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ, ఎనర్జీ డిపార్టుమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆదివారం జిల్లాకు వచ్చారు.
కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 18: కర్నూలు జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీ, ఎనర్జీ డిపార్టుమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆదివారం జిల్లాకు వచ్చారు. పోలీస్ గెస్ట్ హౌస్లో ఆయనకు కలెక్టర్ వీర పాండియన్ పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్వో పుల్లయ్య, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, డీఎంహెచ్వో డా.రామగిడ్డయ్య, డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి తదితరులు కలిశారు.