21న ఎండీయూ వాహనాల ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-19T05:26:51+05:30 IST

ఈ నెల 21వ తేదీన రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ చేసే మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల ప్రారంభోత్సవం జరుగుతుందని, అందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు.

21న ఎండీయూ వాహనాల ప్రారంభం

గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21వ తేదీన రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ చేసే మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్ల ప్రారంభోత్సవం జరుగుతుందని, అందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఆయన సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మండలస్థాయి అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు చెందిన 899 ఎండీయూ వాహనాలను ఆ రోజున విజయవాడలో సీఎం ప్రారంభిస్తారని చెప్పారు.  జిల్లాలో ఎన్‌సీఎల్‌పీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్ల పనితీరుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-19T05:26:51+05:30 IST