కోదండరామున్ని దర్శించుకున్న కలెక్టర్ హరికిరణ్
ABN , First Publish Date - 2021-07-28T05:00:39+05:30 IST
ఏకశిలా నగరం కోదండరామాలయాన్ని కలెక్టర్ హరికిరణ్ మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఒంటిమిట్ట, జూలై27 : ఏకశిలా నగరం కోదండరామాలయాన్ని కలెక్టర్ హరికిరణ్ మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ హరికిరణ్కు సబ్కలెక్టర్ కేతన్గార్గ్, తహసీల్దారు విజయకుమారి స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ కోదండరాముని బ్రహ్మోత్సవాలను కరోనా నేపథ్యంలో 2 సంవత్సరాలు ఏకాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.