సంక్షేమ ఫలాలు పేదలకు అందాలి
ABN , First Publish Date - 2020-10-24T11:29:53+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని కలెక్టర్ కేవీఎన్. చక్రధర్బాబు అన్నారు. పడుగుపాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.
కలెక్టరు చక్రధర్బాబు
కోవూరు, అక్టోబరు 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని కలెక్టర్ కేవీఎన్. చక్రధర్బాబు అన్నారు. పడుగుపాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు కృషి చేయాలని కోరారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో కొవిడ్పై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సచివాలయాల్లోని పలు రికార్డులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సచివాలయ సమస్యలను పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మి, తహసీల్దారు సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి, పంచాయితీరాజ్ ఏఈ పరమేశ్వర లింగం తదితరులు పాల్గొన్నారు.