జిల్లా కలెక్టర్ సహా 250 మంది రక్తదానం
ABN , First Publish Date - 2022-08-13T05:37:39+05:30 IST
జాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా రెడ్క్రాస్ సొసైటీ, వైద్య ఆరోగ్య శాఖ, సెట్వెల్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన భవన్లో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఏలూరు కలెక్టరేట్, ఆగస్టు 12 : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా రెడ్క్రాస్ సొసైటీ, వైద్య ఆరోగ్య శాఖ, సెట్వెల్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన భవన్లో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13 నుంచి 15 వరకూ ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగురవేయాలని సూచించారు. 250 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. జేసీ అరుణ్బాబు, డీఎంహెచ్వో రవి, ఇన్ఛార్జి డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్, జడ్పీ సీఈవో రవికుమార్, సెట్వెల్ సీఈవో మెహర్రాజ్, తహసిల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.