కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2021-03-05T06:24:14+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నిర్ణయించిన కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎటువంటి లోపాలకు తావివ్వరాదని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేయండి
కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మి తదితరులు

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌

వార్డుల వారీగా కేంద్రాల తనిఖీ

విశాఖపట్నం, మార్చి 4: జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు నిర్ణయించిన కౌంటింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎటువంటి లోపాలకు తావివ్వరాదని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను జీవీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు.


ఓట్ల లెక్కింపునకు అవసరమైన మెటీరియల్‌ అక్కడే పంపిణీ చేస్తారని అధికారులకు వివరించారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై జీవీఎంసీ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ పెంచల కిశోర్‌, జీవీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ వేణుగోపాలరావు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-05T06:24:14+05:30 IST