కోర్టు కేసులను పూర్తి చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-19T04:37:18+05:30 IST

కోర్టు కేసులను పూర్తి చేయాలి : కలెక్టర్‌

కోర్టు కేసులను పూర్తి చేయాలి : కలెక్టర్‌

ములుగు కలెక్టరేట్‌, జనవరి 18: ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని రెవెన్యూ కోర్టు కేసులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య తహసీల్దార్లకు సూచించారు. ములుగులోని కలెక్టరేట్‌లో సోమవారం రెండు జిల్లాల తహసీల్దార్లతో సమావేశమై మాట్లాడారు. తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది ములుగు కలెక్టరేట్‌లో ఉండి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎంత ప్రభుత్వ భూమి ఉందనే దానిపై, సాదాబైనామా రికార్డు ఏవిధంగా మార్పు చెందిందనే దానిపై పూర్తి వివరాలు సంబంధిత నమూనా కాలంలో రికార్డులు పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌ రికార్డులు పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు సెలవు రోజుల్లో కూడా కార్యాలయంలో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ములుగు, భూపాలపల్లి అదనపు కలెక్టర్లు ఆదర్శ్‌సురభి, స్వర్ణలత, ములుగు డీఆర్‌వో రమాదేవి, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T04:37:18+05:30 IST