ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-07-01T10:53:56+05:30 IST

ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా 


ఆసిఫాబాద్‌, జూన్‌30: ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి రవిందర్‌ పథకానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కమిటీకి వివరించి జిల్లా ప్రణాళికకు ఆమోదం పొందారు. ఈ పథకంలో పప్పు దినుసులు 3,464 హెక్టార్లకు గాను 58.99 లక్షలు, వరి 1,979 హెక్టార్లకు గాను 26.80 లక్షలు, పత్తి 455 హెక్టార్లకు 7.29 లక్షలు మొత్తం ఈ పథకం కింద 6,828 హెక్టార్లకు 105.67 లక్షలు జిల్లా ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. ఈ పథకంలో రైతులకు సాముహిక ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి రాంబాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాథోడ్‌ శ్యాంరావు, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ రాజేశ్వర్‌ నాయక్‌, ఉమ్మడి జిల్లా ఆహార భద్రత పథకం కన్సల్టెంట్‌ నర్సింగ్‌, వాసన్‌ ప్రతినిధి, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-01T10:53:56+05:30 IST