ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-07-01T10:53:56+05:30 IST
ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు.
కలెక్టర్ సందీప్కుమార్ ఝా
ఆసిఫాబాద్, జూన్30: ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి రవిందర్ పథకానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కమిటీకి వివరించి జిల్లా ప్రణాళికకు ఆమోదం పొందారు. ఈ పథకంలో పప్పు దినుసులు 3,464 హెక్టార్లకు గాను 58.99 లక్షలు, వరి 1,979 హెక్టార్లకు గాను 26.80 లక్షలు, పత్తి 455 హెక్టార్లకు 7.29 లక్షలు మొత్తం ఈ పథకం కింద 6,828 హెక్టార్లకు 105.67 లక్షలు జిల్లా ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. ఈ పథకంలో రైతులకు సాముహిక ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాథోడ్ శ్యాంరావు, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్, ఉమ్మడి జిల్లా ఆహార భద్రత పథకం కన్సల్టెంట్ నర్సింగ్, వాసన్ ప్రతినిధి, రైతులు పాల్గొన్నారు.