కార్పొరేట్లు సామాజిక బాధ్యత చూపాలి
ABN , First Publish Date - 2021-04-19T06:28:32+05:30 IST
వ్యాపార దృక్ప థంతో పాటు బహుళజాతి సంస్థలు సామాజిక బాధ్యతను కరోనా వంటి విపత్కర సమయంలో ను, ప్రకృతి విపత్తుల సమయంలోను చూపటం ఆదర్శనీయమని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నా రు.
కలెక్టర్ ఇంతియాజ్
పాయకాపురం, ఏప్రిల్ 18 : వ్యాపార దృక్ప థంతో పాటు బహుళజాతి సంస్థలు సామాజిక బాధ్యతను కరోనా వంటి విపత్కర సమయంలో ను, ప్రకృతి విపత్తుల సమయంలోను చూపటం ఆదర్శనీయమని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నా రు. విప్రో సంస్థ ఏరియా మేనేజర్ బి. నరసిం హులు 1500 శానిటైజర్ కిట్లను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీటిని మున్సిప ల్ శానిటరీ సిబ్బందికి, నర్సులకు, వైద్య సిబ్బంది కి, పోలీసులకు అందిస్తామన్నారు. విప్రో ఆధ్వ ర్యంలో అందజేస్తున్న కిట్లను సీపీ బత్తిన శ్రీనివా సులుకు కూడా అందించినట్లు నిర్వాహకులు తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు.
సమాజాన్ని సమష్టిగా కాపాడుకోవాలి
విజయవాడ సిటీ : ప్రమాదకరంగా ఉన్న కరోనా సెకండ్ వేవ్ నుంచి సమాజాన్ని సమష్టి గా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ కొవిడ్ కంట్రోల్రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా మన్నారు. ఇప్పటికే రెడ్క్రాస్ సొసైటీ జిల్లా విభా గం పంచసూత్రాల పేరిట ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రూపొం దించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. జేసీ.కె.మోహన్కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం, సెక్ర టరీ డాక్టర్ ఇళ్ల రవి, పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.