హక్కుల సాధనకు సమష్టి పోరాటం

ABN , First Publish Date - 2022-01-25T05:19:29+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన కోసం సమష్టి పోరాటానికి నిర్ణయించారు. ఈమేరకు సోమవారం పీఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు.

హక్కుల సాధనకు సమష్టి పోరాటం
మందస తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న సిబ్బంది

నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల సాధన కోసం సమష్టి పోరాటానికి నిర్ణయించారు. ఈమేరకు సోమవారం  పీఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ, ధర్నా జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పొదిలాపు శ్రీనివాస రావు, తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఎంపీడీవో జి.రవికుమార్‌, ఎస్‌టీఎం జ్యోతి లక్ష్మి, ఉపాధ్యాయ సంఘాల నేతలు  శ్రీరామమూర్తి, భూషణరావు, ఆదినారాయణ, సత్యానంద్‌, పాల్గొన్నారు. 


 తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది నిరసన 

మందస: రివర్స్‌ పీఆర్సీని వ్యతిరేకిస్తూ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎదుట రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు  సోమవారం నల్లబ్యాడ్జీలతో సిబ్బంది నిరసన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.పాపారావు, డీటీ ఎన్‌. రమేష్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-01-25T05:19:29+05:30 IST