టీడీపీ బలోపేతానికి సమష్టి కృషి అవసరం
ABN , First Publish Date - 2022-05-20T05:34:00+05:30 IST
టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు.
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం
ముంచంగిపుట్టు, మే 19: టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమష్టి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు. గురువారం టీడీపీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించేందుకు ఇప్పటి నుంచే శ్రమించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఈనెల 28న జరగబోయే టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.రామ్మూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు కె.బలరామ్, యువజన మండల నాయకుడు వంతాల చిన్నా తదితరులు పాల్గొన్నారు.