కలసికట్టుగా అభివృద్ధి
ABN , First Publish Date - 2021-10-17T05:45:52+05:30 IST
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధి కోసం కృషి చెయ్యాలని జడ్పీ చైర్మన మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
జడ్పీ చైర్మన శ్రీనివాసరావు
ఏడు స్టాండింగ్ కమిటీల ఎన్నిక
విజయనగరం(ఆంధ్రజ్యోతి), అక్టోబరు 16 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధి కోసం కృషి చెయ్యాలని జడ్పీ చైర్మన మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏడు స్టాండింగ్ కమిటీల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఒక్కో కమిటీలో చైర్మన్తో పాటు మరో ఏడుగురు వంతున సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏడు స్టాండింగ్ కమిటీల్లో జడ్పీ చైర్మన్ నాలుగు కమిటీలకు అధ్యక్షుడు కాగా, రెండు కమిటీలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇద్దరు జడ్పీటీసీలు ఎన్నికయ్యారు. అనంతరం జడ్పీ చైర్మన మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కమిటీలను ఏకగ్రీంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికైన సభ్యులందరు తమకు కేటాయించిన శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. త్వరలోనే కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య జరుగుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సీలు పెనుమత్స సురేష్బాబు, పాకలపాటి రఘువర్మ, ఎమ్మెల్యేలు, వీరభద్రస్వామి, శంబంగి చినఅప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.