ఉక్కు కర్మాగారంపై సంతకాల సేకరణ
ABN , First Publish Date - 2021-04-15T05:53:48+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నా నికి చెందిన బైక్ రైడర్ వినీల్మనోహర్ తెలిపారు.
ఇచ్ఛాపురం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని విశాఖపట్నా నికి చెందిన బైక్ రైడర్ వినీల్మనోహర్ తెలిపారు. బుధవారం ఇచ్ఛాపురంలో స్టీల్ప్లాంటు ప్రైవేటీ కరిం చవద్దని సంతకాలు సేకర ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాతబస్టాండ్లో, భగవతి స్వేచ్ఛావతి ఆటోయూనియన్ కార్యాలయం వద్ద సంతకాలు సేకరణ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎ.రమేష్, యు.ఎర్రయ్యరెడ్డి పాల్గొన్నారు.