ఎంపిక చేసిన గ్రామాల్లో రక్త నమూనాల సేకరణ

ABN , First Publish Date - 2021-04-13T06:18:27+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృ తంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో యాంటీ బాడీస్‌ ఏ మేరకు ఉన్నాయో నిర్ధారిం చేం దుకు ఎంపిక చేసిన వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నట్టు పాయక రావుపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శిరీష తెలిపారు.

ఎంపిక చేసిన గ్రామాల్లో రక్త నమూనాల సేకరణ
పాయకరావుపేటలో రక్త నమూనాలను సేకరిస్తున్న వైద్య సిబ్బంది


పాయకరావుపేట/ నక్కపల్లి , ఏప్రిల్‌ 12  : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృ తంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో యాంటీ బాడీస్‌ ఏ మేరకు ఉన్నాయో నిర్ధారిం చేం దుకు ఎంపిక చేసిన వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నట్టు పాయక రావుపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శిరీష తెలిపారు. సెరో సర్వెలెన్స్‌  ప్రొగ్రాంలో భాగంగా  పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన వైద్య సిబ్బంది 20 మంది నుంచి రక్త నమూనాలు సేకరిం చారు.  వీటిని పరీక్షల నిమిత్తం పూణె పంపనున్నామని చెప్పారు. ఎంపీఈవో రమణతో పాటు పీహెచ్‌సీ సిబ్బంది మూర్తి, చక్రవర్తి, భవానీ, అప్పలనర్స తదితరులు పాల్గొన్నారు. అలాగే, నక్కపల్లి మండలం లోని పలు గ్రామాల్లో గొడిచెర్ల పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ పర్యవేక్షణలో రక్త నమూనాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వేంపాడు, నక్కపల్లి, పెదతీనార్ల, ఉద్దండపు రం, రాజయ్యపేట గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామాల్లోని  ఐదిళ్లలో ఒక వృద్ధుడ్ని ఎంపిక చేసి  రక్తనమూనాలను సేకరించారు. 


Updated Date - 2021-04-13T06:18:27+05:30 IST