డీఎన్ఏ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరణ

ABN , First Publish Date - 2021-12-10T02:27:02+05:30 IST

ఘోర ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ

డీఎన్ఏ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరణ

చిత్తూరు: ఘోర ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ మృతదేహాన్ని గుర్తించడానికి వీలుగా సాయి తల్లిదండ్రుల నుంచి డీఎన్ఏ పరీక్షల కోసం రక్త నమూనాలను ఆర్మీ వైద్య బృందం సేకరించింది. ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు లభ్యమయ్యాయి. డీఎన్ఏ పరీక్షల నిర్వహణతో కుటుంబ సభ్యులకు మృతదేహాలను ఆర్మీ అధికారులు అప్పగించనున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న సాయితేజ తమ్ముడు మహేష్‌బాబు రక్త నమూనాలను కూడా వైద్యులు సేకరించారు.  


తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం మన రాష్ట్రాన్నీ విషాదంలో ముంచింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న బొగ్గ్గుల సాయితేజ(27) ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2021-12-10T02:27:02+05:30 IST