యాదాద్రి స్వర్ణగోపుర తాపడానికి విరాళాల సేకరణ

ABN , First Publish Date - 2021-10-21T01:17:08+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్‌ కిలో 16 తులాల బంగారం తొలివిరాళం ప్రకటించటంతో భక్తుల

యాదాద్రి స్వర్ణగోపుర తాపడానికి విరాళాల సేకరణ

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడానికి సీఎం కేసీఆర్‌ కిలో 16 తులాల బంగారం తొలివిరాళం ప్రకటించటంతో భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు దేవస్థాన అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామి వారి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించేందుకు 125 కిలోల బంగారం అవసరంకాగా, రూ. 65కోట్లు వ్యయం కానుంది. మేలిమి బంగారాన్ని రిజర్వు బ్యాంకు ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ, వైటీడీఏ, తదితర అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలో సంబంధిత అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

Updated Date - 2021-10-21T01:17:08+05:30 IST