సచివాలయాల ద్వారా విస్తృత సేవలు

ABN , First Publish Date - 2021-07-25T02:55:11+05:30 IST

ప్రజలకు అవసరమైన అన్ని సేవలను వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

సచివాలయాల ద్వారా విస్తృత సేవలు
సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆకస్మిక తనిఖీ

కావలి, జూలై 24: ప్రజలకు అవసరమైన అన్ని సేవలను వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. మంత్రుల పర్యటనలో భాగంగా శనివారం కావలికి వచ్చిన ఆయన మధ్మాహ్నం భోజన విరామ సమయంలో కావలి పట్టణం పుల్లారెడ్డినగర్‌, శాంతినగరలలో ఉన్న 11, 19వ సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డులు ఏర్పాటు, కార్యదర్శుల హాజరుపై రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సచివాలయాల పరిధిలోని ప్రజలు తమ అవసరాల కోసం ఏ కార్యాలయాలకు వెళ్లకుండా అన్ని సేవలు సచివాలయాల ద్వారానే అందుతాయని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో శీనానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డి, తహసీల్దారు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T02:55:11+05:30 IST