మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

ABN , First Publish Date - 2020-11-29T04:55:20+05:30 IST

వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్‌ జె.నివాస్‌ కొనియాడారు.

మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ జె. నివాస్‌




నివాళులర్పించిన కలెక్టర్‌ నివాస్‌

కలెక్టరేట్‌, నవంబరు 28:  వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్‌ జె.నివాస్‌ కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  శ్రీకాకుళంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని శనివారం నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలోని దురాచారాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా 150ఏళ్ల  కిందటే జ్యోతిరావు పూలే ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. తద్వారా వెనుకబడిన వర్గాలు, నిమ్నజాతులకు ఆశాజ్యోతి అయ్యారని కొనియాడారు. చరిత్రలో పూలే స్ఫూర్తిగా నిలిచిపోయారని గుర్తు చేశారు.  కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కేకే కృత్తిక, బీసీ కార్పొరేషన్‌ ఈడీ జి.రాజారావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T04:55:20+05:30 IST