యడవల్లి వీకర్స్ సొసైటీ భూములను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-22T06:31:54+05:30 IST
చిలకలూరిపేట మండలంలోని యడవల్లిలోని వీకర్స్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ భూములను జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ సోమవారం పరిశీలించారు.
చిలకలూరిపేట, జూన్ 21: చిలకలూరిపేట మండలంలోని యడవల్లిలోని వీకర్స్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ భూములను జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ సోమవారం పరిశీలించారు. భూగర్భగనుల శాఖ, వ్యవసాయ, మురుగునీటి పారుదలశాఖ అధికారులు భూములను ఇప్పటికే పరిశీలించి నివేదికను కలెక్టర్కు అందజేశారు. ఆయా భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్న నేపథ్యంలో తమకు అప్పగించాలని ఏపీఎండీసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వివేక్యాదవ్, జేసీ దినేష్కుమార్లు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములకు సంబంధించిన అన్ని వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ భూములకు సంబంధించిన నివేదికను కలెక్టర్ త్వరలోనే ప్రభుత్వానికి అందజజేయనున్నట్లు తెలిసింది. మైనింగ్ ఏడీ విష్ణువర్ధన్, ఇన్చార్జి ఆర్డీవో పార్థసారధి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు, తహసీల్దార్ మల్లికార్జునరావు, ఏడీఏ మస్తానమ్మ, ఏవో శ్రీలత తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.