సర్వేకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-10-17T06:26:57+05:30 IST

ఇంటింటి సర్వేకు ప్రతి కుటంబం విధిగా సహకరించాలని తాండూరు డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం

సర్వేకు సహకరించాలి

బషీరాబాద్‌/కులకచర్ల: ఇంటింటి సర్వేకు ప్రతి కుటంబం విధిగా  సహకరించాలని తాండూరు డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం బషీరాబాద్‌లో ఎంపీవో రమే్‌షతో కలిసి సర్వేను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానులు అధికారులకు కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించి నమోదు చేయించుకోవాలన్నారు. ఆయన వెంట జూనియర్‌ పంచాయతీ కార్యర్శులు పలువురు ఉన్నారు.  కులకచర్లలోని కామునిపల్లి గ్రామంలో ఎంపీవో సుందర్‌ ఆస్తుల సర్వేను పరిశీలించి సర్వే అధికారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందు పరుచాలని తెలిపారు.  కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య, కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-17T06:26:57+05:30 IST