ప్రతి శనివారం ‘కాఫీ విత్‌ క్లాప్‌మిత్ర’

ABN , First Publish Date - 2022-01-23T06:29:44+05:30 IST

ప్రతి శనివారం ‘కాఫీ విత్‌ క్లాప్‌మిత్ర’

ప్రతి శనివారం ‘కాఫీ విత్‌ క్లాప్‌మిత్ర’
మాట్లాడుతున్న జేసీ శివశంకర్‌

వీరులపాడు/ పాయకాపురం, జనవరి 22: జిల్లాలో ఇకపై ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకు ఏదైనా చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే కేంద్రం వద్ద చెత్త సేకరించే కార్మికులతో ‘కాఫీ విత్‌ క్లాప్‌మిత్ర’ కార్యక్రమం నిర్వహిస్తామని జేసీ ఎల్‌. శివశంకర్‌ ప్రకటించారు. వీరులపాడు మండలంలోని పొన్నవరంలో చెత్త సేకరించే కార్మికులతో చెత్త నుంచి సంపద ఉత్పత్తి చేసే కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌మిత్ర) కార్యక్ర మాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. కరోనా  సమయంలో ప్రజలందరూ చెత్త సేకరణ కార్మికుల సేవలను గుర్తించారని కితాబిచ్చారు. ఇకపై ప్రతి శనివారం తాను కార్మికులతో కలిసి కాఫీ తాగి వారి సేవలను ప్రోత్సహిస్తానన్నారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కేంద్రాలు పలు చోట్ల నిరుపయోగంగా ఉన్నాయని, వాటిల్లో చెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేసి రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నాటికీ రైతులకు అందించాలలని జేసీ సూచించారు. తహసీల్దార్‌ జి.విక్టర్‌బాబు, ఎంపీడీవో రామకృష్ణ నాయక్‌, ఈవోపీఆర్డీ నాగేశ్వరరావు, కార్యదర్శులు శ్యామ్‌కుమార్‌, ప్రియాంక పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T06:29:44+05:30 IST