కోడి పందేలపై దాడి.. ఏడుగురి అరెస్టు
ABN , First Publish Date - 2022-01-29T06:51:37+05:30 IST
మండలంలోని మసకపల్లి సమీపంలోని లంక పొలాల్లో శుక్రవారం తెల్లవారుజామున కోడి పందేలపై దాడి చేసినట్టు ఎస్ఐ కె.చిరంజీవి తెలిపారు.
- 30 బైక్లు, 2 కార్లు, 2 కోళ్లు, రూ.50,270 నగదు స్వాధీనం
కె.గంగవరం, జనవరి 28: మండలంలోని మసకపల్లి సమీపంలోని లంక పొలాల్లో శుక్రవారం తెల్లవారుజామున కోడి పందేలపై దాడి చేసినట్టు ఎస్ఐ కె.చిరంజీవి తెలిపారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి 30 బైక్లు, రెండు కార్లు, రెండు కోళ్లతోపాటు రూ.50270 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.