25న టెస్టు క్రికెటర్లు దుబాయ్‌ రాక

ABN , First Publish Date - 2020-10-24T09:24:35+05:30 IST

భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్న ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, కోచ్‌ రవిశాస్త్రి ఆదివారం

25న టెస్టు క్రికెటర్లు దుబాయ్‌ రాక

దుబాయ్‌: భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్న ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, కోచ్‌ రవిశాస్త్రి ఆదివారం దుబాయ్‌ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఐపీఎల్‌ ముగిశాక నవంబరు 11 లేక 12వ తేదీన భారత జట్ల భారీ బృందం ప్రత్యేక విమానంలో సిడ్నీకి పయనమవుతుంది. ఆసీ్‌సలో అడుగుపెట్టాక నిబంధనల ప్రకారం ఆటగాళ్లంతా 12 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఈ సందర్భంగా వారు సిడ్నీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. మరోవైపు కిట్‌ స్పాన్సర్‌ లేకుండానే భారత జట్టు ఆసీస్‌ టూర్‌కు వెళ్లనుంది. గత నెలలోనే నైకీ ఒప్పందం ముగియగా మరో కంపెనీ ఇప్పటిదాకా ముందుకు రాలేదు.

Updated Date - 2020-10-24T09:24:35+05:30 IST