ఐపీఎల్ రద్దయినా.. మహీకి చాన్సుంది!
ABN , First Publish Date - 2020-03-28T09:49:40+05:30 IST
వన్డే ప్రపంచకప్ (2019) తర్వాత నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న మహేంద్రసింగ్ ధోనీని మరోసారి మైదానంలో చూడగలమా అని ఎదురుచూస్తున్న
వన్డే ప్రపంచకప్ (2019) తర్వాత నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న మహేంద్రసింగ్ ధోనీని మరోసారి మైదానంలో చూడగలమా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అతడి చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ ఊరటనిచ్చే మాటలు చెప్పాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్ జరిగేలాలేదు. ఐపీఎల్లో ఆడకుండా జట్టులో ధోనీకి చోటు దక్కడం కష్టమే అయినా అసాధ్యమైతే కాదు. నా అంచనా ప్రకారం టీ20 వరల్డ్కప్ జట్టులో ధోనీ ఉంటాడు’ అని కేశవ్ చెప్పుకొచ్చాడు.