కోఆప్షన్ సభ్యుల ఎన్నిక
ABN , First Publish Date - 2020-08-11T10:43:44+05:30 IST
వనపర్తి జిల్లాలో నూతనంగా ఏర్పాడిన పెబ్బేరు మునిసిపాలిటిలో మొదటిసారిగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం అధికారులు పూర్తిచేశారు.
పెబ్బేరు, ఆగస్టు10: వనపర్తి జిల్లాలో నూతనంగా ఏర్పాడిన పెబ్బేరు మునిసిపాలిటిలో మొదటిసారిగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం అధికారులు పూర్తిచేశారు. అన్ని పదవులు టీఆర్ఎస్ నాయకులకే దక్కా యి. మొత్తం 12 మంది కౌన్సిలర్లు హజరు కాగా అందులో 8 మంది కౌ న్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కాగా వారు ఆమోదించిన సభ్యులే ఎన్ని కయ్యారు. కాంగ్రెస్ సభ్యులు నామినేషన్ వేసి భంగపడ్డారు. ఎన్నికైన స భ్యులు ఫదీదాబేగం, బోయశ్రీదేవి, ఎండీ. ముస్తాక్, బోల్లి ప్రసాద్, ఐజా క్కు నియామక పత్రాలను కమిషనర్ ప్రవీణ్కుమార్ అందించారు. చైర్మ న్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.